
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చాడు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తనకు పంపించిన నోటీసులను వాపస్ తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు రేవంత్ రెడ్డి. TSPSC పేపర్ లీక్స్ లో ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు సంబంధం ఉందని , అలాగే కేటీఆర్ పీఏ తిరుపతికి సంబంధం ఉందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దాంతో TSPSC కేసును విచారిస్తున్న సిట్ బృందం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని , అలాగే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని తెలిపిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టాడు. దాంతో పరువు నష్టం దావా వేసాడు కేటీఆర్. 100 కోట్ల మేర పరువు నష్టం దావా వేసి తక్షణమే క్షమాపణ చెప్పకపోతే తదుపరి చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.
దాంతో స్పందించిన రేవంత్ రెడ్డి తనకు పంపించిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోకపొతే నేను క్రిమినల్ చర్యలకు సిద్ధమౌతానని కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చాడు.దాంతో రసవత్తరంగా మారింది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.






