
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత లీగల్ అడ్వైజర్ సోమా భరత్ రెండో రోజు కూడా ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ఎమ్మెల్సీ కవిత వాడిన మొత్తం 11 ఫోన్లు ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ ఫోన్ ల తాలూకు అన్ని వివరాలను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. దాంతో కవితను లేదంటే మీ తరుపున ఎవరినైనా ప్రతినిధిని పంపించాలని ఈడీ కోరడంతో కవిత తన ప్రతినిధిగా సోమా భరత్ ను పంపించింది.
నిన్న ఈడీ విచారణకు హాజరైన సోమా భరత్ ఇక ఈరోజు కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళాడు. సోమా భరత్ సమక్షంలో కవిత సెల్ ఫోన్ లను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. అందులోని సమాచారాన్ని బట్టి ఒక అవగాహనకు వచ్చిన తరువాత మళ్ళీ కవితను విచారించవచ్చని తెలుస్తోంది.






