తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి మరోసారి నోటీసులు జారీ చేసింది సిట్. TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసాడు బండి సంజయ్. దాంతో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది సిట్.
ఈనెల 24 న బండి సంజయ్ ని సిట్ ముందు హాజరై సాక్ష్యాలను ఇవ్వాల్సిందిగా అదే విధంగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది సిట్. అయితే సిట్ దర్యాప్తు పై నాకు నమ్మకం లేదని, అందుకే సిట్ విచారణకు హాజరు కానని స్పష్టం చేశాడు బండి. దాంతో ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేసింది సిట్ బృందం. మరి ఈ నోటీసులపై బండి ఎలా స్పందిస్తాడో చూడాలి.