38.5 C
India
Thursday, March 28, 2024
More

    సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ దుర్ఘటనలో ఆరుగురు మృతి

    Date:

    six died in secunderabad fire accident
    six died in secunderabad fire accident

    సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నిన్న సాయంత్రం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎనిమిది అంతస్తులున్న స్వప్న లోక్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున షాపులు , ఆఫీసులు ఉన్నాయి. మొత్తంగా 400 వరకు ఆఫీసులు , షాపులు , గోడౌన్ లు ఉన్నాయి.

    మొత్తం 14 మందిని రెస్క్యూ చేసిన అగ్నిమాపక సిబ్బంది అందులో చిక్కుకున్న ఆరుగురిని మాత్రం కాపాడలేకపోయింది. దట్టమైన పొగ అలుముకోవడంతో ఆ పొగలో ఎటూ వెళ్లలేక అచేతనంగా పడిపోయారు. పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో అపస్మారక స్థితిలో చేరుకున్నారు. వాళ్ళను ఎంతో కష్టించి బయటకు తీసుకువచ్చినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే మరణించారని డాక్టర్లు తెలిపారు. చనిపోయిన వాళ్లలో ప్రమీల , త్రివేణి , శ్రావణి , శివ , ప్రశాంత్ , వెన్నెల ఉన్నారు.

    అయితే స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో బిల్డింగ్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు అధికారులు. పురాతనమైన బిల్డింగ్ కావడంతో పాటుగా మంటలు చెలరేగడంతో స్వప్నలోక్ కాంప్లెక్స్ చుట్టుపక్కల అపార్ట్ మెంట్ వాసులను అలాగే బస్తీవాసులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Breaking news: సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం

    బ్రేకింగ్ న్యూస్...... సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ...