
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా శాంతి కుమారిని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆమేరకు ఉత్తర్వులు జారీచేశారు. సోమేష్ కుమార్ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు రద్దు చేయడంతో ఆయన స్థానంలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో శాంతి కుమారి ని నియమించింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొట్ట మొదటి మహిళా సీఎస్ గా నిలిచారు. శాంతి కుమారి 1989 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వారు కావడం విశేషం.