తెలంగాణలో గవర్నర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దాంతో గవర్నర్ పలు సందర్భాల్లో పలు పర్యటనలు చేసిన సమయంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దాంతో అప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు ఉప్పు నిప్పు లా సాగుతూనే ఉంది. ఇక ఇప్పుడేమో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ వివాదం మరింత రాజుకుంది. జనవరి 26 న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించే అవకాశం ఉండేది.
కానీ గవర్నర్ తమిళ సై అంటే కోపంగా ఉన్న కేసీఆర్ గత కొంత కాలంగా ప్రోటోకాల్ విషయంలో పలు ఇబ్బందులు పెడుతున్నారు. ఇక ఇప్పుడేమో గణతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం రాజ్ భవన్ లోనే చేసుకోవాలని కోరారు. దాంతో రేపు ఉదయం రాజ్ భవన్ లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని గవర్నర్ తమిళ సై నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అయ్యాక ఉదయం 7.45 గంటలకు పాండిచ్చేరి కి వెళ్లనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాక రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.