34 C
India
Friday, March 29, 2024
More

    పైగా ప్యాలెస్ కు అమెరికా కాన్సులేట్ వీడ్కోలు

    Date:

    US consulate to be shift from paigah palace to nanakram guda
    US consulate to be shift from paigah palace to nanakram guda

    హైదరాబాద్ మహానగరంలోని ”పైగా ప్యాలెస్ ” కు వీడ్కోలు పలికింది అమెరికా కాన్సులేట్. 14 సంవత్సరాలుగా సేవలు అందించిన పైగా ప్యాలెస్ ఈరోజుతో మూతబడనుంది. ఈనెల 23 నుండి నానక్ రాంగూడ లోని అమెరికా కాన్సులేట్ కొత్త కార్యాలయం అక్కడి నుండే సేవలు అందించనుంది. ఈరోజు పైగా ప్యాలెస్ ప్రాంగణం అంతా ఖాళీ చేయనుంది అమెరికా కాన్సులేట్.

    తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , ఒడిశా రాష్ట్రాలకు చెందిన వాళ్లకు వీసా సేవలు అందించే ఈ అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఇక నుండి నానక్ రాంగూడ నుండే సేవలు అందించనుంది. 2006 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ హైదరాబాద్ లో పర్యటించారు. ఆ సమయంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.

    అమెరికా అధికారులు పలు భవనాలను పరిశీలించిన మీదట బేగంపేట లోని పైగా ప్యాలెస్ ను ఎంపిక చేసారు. నైజాం నవాబ్ దగ్గర ప్రధానమంత్రిగా పని చేసే నవాబ్ వికారుల్ ఉమ్రా ఈ ప్యాలెస్ ను రెండున్నర ఎకరాలలో యూరోపియన్ శైలిలో నిర్మించాడు. కాలక్రమంలో నైజాం నవాబ్ ఆస్తులలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. అలా వచ్చిన ఈ పైగా ప్యాలెస్ లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ కార్యాలయం ఉండేది.

    నానక్ రాంగూడలోని 12. 3 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవంతి సిద్దమయింది. దాంతో ఈరోజుతో పైగా ప్యాలెస్ లో సేవలు నిలిచిపోనున్నాయి. ఈనెల 23 నుండి కొత్త కార్యాలయం నుండి వీసా సేవలు అందించనుంది అమెరికా కాన్సులేట్ ఇక్కడ ప్రతీ రోజు 2500 మందిని ఇంటర్వ్యూ చేయడానికి 54 వీసా ఇంటర్వ్యూ కేంద్రాలను ఏర్పాటు చేసారు.

    Share post:

    More like this
    Related

    Ex-DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో మాజి డీసిపి రాధాకిషన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

    Ex-DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డిసిపి రాధా...

    Kadiyam Srihari : నేడు కాంగ్రెస్ లో కి.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీహరి

    Kadiyam Srihari : ఈరోజు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్...

    Good Friday 2024 : గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత

    క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. 1. లోకరక్షకుడు యేసుప్రభు పుట్టినరోజు క్రిస్మస్ 2....

    South Africa : లోయలో పడిన బస్సు.. 45మంది మృతి

    South Africa : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోట్స్...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related