తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ల మధ్య మరోసారి ట్విట్టర్ వార్ మంటలు పెడుతోంది. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం – ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం- ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం – ప్రధాని
ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వం – ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం – ప్రధాని
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వం – ప్రధాని
ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వం – ప్రధాని
ప్రధాని ప్రాధాన్యతల్లో
అసలు తెలంగాణ లేనప్పుడు
తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకుండాలి ?
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి ?
ఇది మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వేసిన ప్రశ్నలు.
ఇక బండి సంజయ్ ఊరుకుంటాడా ? కేటీఆర్ కు అదే రీతిలో బదులిచ్చాడు.
ఉద్యమ కారులకు పార్టీలో చోటివ్వం – కేసీఆర్
దళితులకు మూడెకరాలు ఇవ్వం – కేసీఆర్
దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం – కేసీఆర్
ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చేయం – కేసీఆర్
నిరుద్యోగ భృతి ఇవ్వం – కేసీఆర్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వం – కేసీఆర్
దళితబంధు అర్హులకు ఇవ్వం – కేసీఆర్
పంచాయతీ , మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వం – కేసీఆర్
ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వం – కేసీఆర్
ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వనపుడు , నిన్ను ఎందుకు భరించాలి ? సహించాలి ?
అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే ,
ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఇంకేముందు అటు కేటీఆర్ కు మద్దతుగా కొందరు ఇటు బండి సంజయ్ కు మద్దతుగా మరికొందరు ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం – కేసీఆర్
దళితులకు మూడెకరాలు ఇవ్వం – కేసీఆర్
దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం – కేసీఆర్
ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం – కేసీఆర్
నిరుద్యోగ భృతి ఇవ్వం – కేసీఆర్
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం – కేసీఆర్
దళితబంధు అర్హులకు ఇవ్వం – కేసీఆర్
పంచాయతీ,…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 30, 2023