
చెన్నై లో నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది దాంతో మూడు వన్డేల సిరీస్ ఆసీస్ వశమైంది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి వన్డే భారత్ గెలుచుకోగా రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దాంతో మూడో వన్డేపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ మూడో వన్డేలో టీమిండియా చేతులెత్తేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులు చేసింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ సత్తా చాటలేకపోయింది. పరుగులు సాధించడానికి భారత్ బ్యాట్స్ మెన్ లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు 21 పరుగుల తేడాతో మ్యాచ్ ను ఆస్ట్రేలియా వశం చేసారు. దాంతో భారత్ సొంత గడ్డపై నాలుగేళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా సిరీస్ చేజార్చుకుంది. వన్డే సిరీస్ కోల్పోవడంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది భారత్.






