
IPL లో సరికొత్త ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు. అలా కొత్తగా స్టార్ లుగా అవతరించిన ఆటగాళ్లు కోకొల్లలు. కాగా ఈ ఏడాది సరికొత్త స్టార్ గా అవతరించాడు ఉత్తరప్రదేశ్ కి చెందిన రింకూ సింగ్. ఆదివారం రోజున జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో అందునా 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు రింకు. గుజరాత్ టైటాన్స్ విజయం ఖాయమైపోయిన వేళ బ్యాట్ ఝుళిపించి వరుసగా 5 సిక్సర్లు కొట్టి నయా స్టార్ గా అవతరించాడు.
రింకు సింగ్ ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించడంతో ప్రస్తుతం అందరూ చర్చిస్తున్న పేరు ఒక్కటే అదే రింకు సింగ్. ఇంతకీ ఈ రింకు సింగ్ ఎవరో తెలుసా…… ఉత్తరప్రదేశ్ కి చెందినవాడు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి ఓ ఆటో డ్రైవర్ దాంతో రింకు కూడా ఆటో డ్రైవర్ గా పని చేసాడు కొంతకాలం. రింకు సింగ్ ది పెద్ద కుటుంబం. చాలా చిన్న ఇల్లు మాత్రమే. దాంట్లోనే దాదాపు 9మంది ఉండాలి. నిరుపేద కుటుంబం కావడంతో చాలా కష్టాలు పడ్డాడు. కట్ చేస్తే ఐపీఎల్ రూపంలో రింకు కష్టాలు తీరాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా రింకు గురించే చర్చించుకుంటున్నారంటే ఎంతటి సంచలనం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు.






