ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కొనసాగించడం లేదు. దీంతో ముంబై ఇండియన్స్ కష్టాలు ఎదుర్కొంటోంది. గత సీజన్లలో ఎదురైన పరాభవమే ప్రస్తుతం కూడా కనిపిస్తోంది. దీంతో రోహిత్ శర్మపై విమర్శల దాడి కొనసాగుతోంది. ప్రముఖ క్రికెట్ కామెంటర్ సునీల్ గవాస్కర్ రోహిత్ కు రెస్ట్ అవసరం అని తేల్చడం గమనార్హం.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ప్రస్థానంపై విమర్శల పర్వం పెరుగుతోంది. వరుస మ్యాచులతో రోహిత్ కు విశ్రాంతి లేకుండా పోతోందన్నాడు. అతడికి విశ్రాంతి ఇచ్చి చివరి మ్యాచుల్లో ఆడించడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఆటతీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. రెండు మ్యాచ్ ల్లో కనీసం పదంకెల స్కోరు కూడా చేయకపోవడమే విమర్శలకు కారణమవుతోంది.
టీమిండియా కెప్టెన్లలో అందరు విమర్శలు ఎదుర్కొన్న వారే. దీనికి ఎవరు అతీతులు కారు. గంగూలీ నుంచి రోహిత్ వరకు ప్రతి కెప్టెన్ విమర్శలతోనే సహవాసం చేయాల్సి వచ్చింది. దీంతో రోహిత్ శర్మపై విమర్శలు రావడంలో కొత్తేమీ లేదు. వీటిని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఏదో ఒక సందర్బంలో విమర్శలు ఎదుర్కొన్నవారే కావడంలో వింతేమీ లేదు.
ఐపీఎల్ లో రోహిత్ శర్మ ప్రదర్శనపైనే కామెంట్లు వస్తున్నాయి. సింగిల్ స్కోరుకే వెనుదిరగడం ఆందోళనలకు తావిస్తోంది. 2023 సీజన్ లో ఫామ్ ని కొనసాగించలేకపోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 బంతులు ఆడి 2 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇలాంటి ప్రదర్శన కారణంగా రోహిత్ పై విమర్శల దాడి పెరుగుతోంది. అతడికి విశ్రాంతి ఇవ్వాలని కామెంట్లు వస్తున్నాయి. చివరి మ్యాచ్ ల్లో ఆడించాలని ప్రస్తుతానికి మాత్రం రెస్ట్ ఇవ్వాలని సూచిస్తున్నారు.