కంచే చేను మేస్తే ఎలా ఉంటుంది. రక్షించేవాడే భక్షిస్తే ఇలాగే ఉంటుంది. సెక్యూరిటీగా ఉండే వ్యక్తి చోరీ చేయడం సంచలనం కలిగించింది. దీనికి తార్కాణంగా నిలిచే సంఘటన ఇది. అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి దొంగతనానికి పాల్పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. తన చేతివాటంతో ఫోన్లు చోరీ చేయడం వివాదాస్పదమైంది.
సికింద్రాబాద్ లోని ఎస్డీ రోడ్ లోని ఎమరాల్డ్ హౌస్ లో ఫోన్లు చోరీ జరిగింది. అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వినయ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సెలవు పెట్టి మరీ దొంగతనానికి పాల్పడటం విశేషం. ఉద్యోగానికి సెలవు పెట్టి మే 28న అర్థరాత్రి 12.30 గంటలకు నైటీలో వచ్చి రూ. 8.28 లక్షల ఫోన్లు చోరీ చేశాడు. పోలీసులు విచారణ చేపట్టి వినయ్ పనిగా తేల్చారు.
వినూత్న రీతిలో పథకం వేసి నైటీలో వచ్చినా పోలీసులు పట్టుకోవడం గమనార్హం. అతడు ఉద్యోగానికి సెలవు పెట్టడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో విచారణ చేపట్టగా అతడే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అందరు అవాక్కయ్యారు. కాపలా కాసే వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మొదట దొంగతనం చేసింది మహిళే అనుకున్నారు. కానీ సెక్యూరిటీ గార్డు సెలవు పెట్టాడని తెలుసుకుని ఆ దిశగా ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతడిని తన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మడిపల్లిలో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు. మొత్తానికి చోరీ కేసు చిక్కుముడి వీడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.