ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ మరి కొద్ది రోజులలో గుడ్ న్యూస్ వినబోతున్నాడు. ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో చరణ్ పాటు చిరంజీవి ఫ్యామిలీతో , మెగా ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి చాలా బిజీగా ఉన్న రామ్ చరణ్ తన భార్యతో టైమ్ స్పెండ్ చేయలేక పోయాడు. దీంతో ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జోడీ ఒకటి . పదేళ్ల తర్వాత పుట్టబోయే బిడ్డ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఈ దంపతులు. ప్రస్తుతం ఏడో నెల ప్రెగ్నెంట్ గా ఉన్న ఉపాసన కోసం.. ఇక నుంచి ఎక్కువ టైమ్ కేటాయించాలని చెర్రీ భావిస్తున్నాడట. పైగా ఉపాసన డెలివరీ టైమ్ లో చరణ్ పక్కనే ఉండాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలో ఇప్పటి నుంచి మరో మూడు నెలలు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వాలని.. ఫిక్స్ అయ్యాడట. ఇప్పటి నుంచే ఉపాసనకు సపోర్ట్ గా.. ఆమెతో పాటు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రెండు నెలల్లో మెగా వారసుడు రానుండటంతో.. ముందు రెండు నెలలు.. బిడ్డ పుట్టిన తరువాత మరో నెల బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి అని తన షూటింగ్కి మూడు నెలల పాటు బ్రేక్ ఇచ్చాడట చెర్రీ. ప్రస్తుతం రామ్చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో చెర్రీ షెడ్యూల్ కూడా పూర్తి కానుందట. దీని తర్వాత ఉపాసన వెంట ఉండేందుకు సుమారు 3 నెలల వరకు రామ్చరణ్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మెగా హీరో తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.