29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Scientists: మెహదీపూర్ ఆలయంలో ఏముంది.. సైంటిస్టులు కూడా తేల్చలేకపోయారా..!

    Date:

     

    Rajesthan
    Rajesthan

    Scientists : రాజస్థాన్ లోని దౌస జిల్లాలో ఉన్న మెహదీపూర్ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆలయంలోకి వెళ్లగానే మనకు కనిపించే దృశ్యాలు మనల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి. ఎందరో సైంటిస్టులు ఈ ఆలయంపై పరిశోధనలు చేశారు. అయితే కొన్ని మూడ శక్తులు అవహించిన వారు ఇక్కడికి వస్తే సాధారణంగా మారిపోతారని అంతా అనుకుంటుంటారు. కానీ ఇక్కడ జరిగేది కూడా అదే. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలా మంది మానసిక వైద్య నిపుణులు ఇక్కడికి చేరుకొని పరిశోధనలు చేశారు. ఇక్కడ వచ్చిన ఫలితాలు చూసి డాక్టర్లు కూడా అశ్చర్యపోతుంటారు.

    అసలు మెహదీపూర్ ఆలయంలో ఏముంది. ఈ ఆలయంపై పరిశోధనలు చేయాలని సైంటిస్టులు ఎందుకు అనుకున్నారు.. రెండు కొండల మధ్య ఈ ఆలయంలో హనుమంతుడు కొలువై ఉన్నాడు. మరోవైపు భైరవ బాబాతో పాటు మరో దేవుడి ప్రతిమలు అక్కడ మనకు కనిపిస్తాయి. ముగ్గురు దేవుళ్లకు మూడు రకాల పూజలు, మూడు రకాల ప్రసాదాలు ఉంటాయి. ఇక్కడికి వెళ్లి మనం చూస్తే ముందుగా భయపడడం ఖాయం. ఆధునిక కాలంలో కూడా ప్రజలు సాంకేతికతనే నమ్ముతారు. అయితే ఈ ఆలయానికి వచ్చే వారంత భూత, ప్రేత, పిశాచాలు ఆవహించిన వారే ఎక్కువగా ఉంటారు.  వాటిని వదిలించుకోవడానికే ఇక్కడి వస్తుంటారని ఆలయ పూజారులు చెబుతున్నారు.  అయితే ఇక్కడ ఇచ్చే ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం కుదరదు. తీసుకెళ్లనివ్వరు కూడా. అవి ఇంటికి తీసుకెళ్తే కీడు జరుగుతుందని భావిస్తారు. వెయ్యి ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం స్వయంభూగా వెలిసినట్లుగా చెబుతారు.

    ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా, లోపల మాత్రం చల్లని వాతావరణం ఉంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. కాలమేదైనా ఆలయం కిటకిటలాడుతూనే ఉంటుంది. ఆలయంలో భయానక అరుపులు మనకు వినిపిస్తుంటాయి. మొదటిసారి ఆలయానికి వెళ్లినవారు భయపడడం ఖాయం. మానసికంగా ంబలహీనంగా ఉన్న వారిని ఈ ఆలయానికి రావొద్దని చెబుతారు. మొదటి ఆలయంలో పూజలు జరిగితే, వెనుక రెండో వైపు భూత, ప్రేత, పిశాచాలు ఆవహించిన వారికి చికిత్స అందిస్తుంటారు. ఇక్కడ ప్రసాదం మానసిక రోగులకు అందిస్తే విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే వారం రోజుల ముందునుంచే సిగిరెట్, మద్యం తాగకూడదనే నిబంధన ఉంది. బాలాజీ ఆలయంలో ఉన్న హనుమంతుడి సమీపంలో సీతారాముల విగ్రహాలు కూడా ఉంటాయి. రోగుల సమస్యలు ఇక్కడికి వచ్చాక తీరుతాయి. కొందరు గాలితో మాట్లాడడం మనం చూస్తుంటాం. అయితే వీరందరికీ ఇక్కడ నయమవుతుందని అంతా అంటుంటారు. ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ ఆలయంపై సైంటిస్టులు మానసిక వైద్య నిపుణులు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఏం తేల్చలేకపోయారు. మానసిక రోగులకు ఇక్కడ నయమవుతుండడం వారికి కూడా అంతుచిక్కడం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related