
ICC Cricket World Cup 2023 : భారత్లో నిర్వహించనున్న ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయితే, ఐసీసీ టోర్నమెంట్ మొత్తం షెడ్యూల్ను ఇంకా విడుదల చేయలేదు. టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023 సందర్భంగా బీసీసీఐ ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఐసీసీతో పంచుకుంది. అక్టోబర్ 15న భారత్తో అహ్మదాబాద్లో ఆడేందుకు పాకిస్తాన్ సుముఖంగా లేకపోవడంతో షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేయడంలో జాప్యానికి కారణమని తెలుస్తు్న్నది.
బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 15 న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టోర్నమెంట్లో మోస్ట్ ఎవైటెడ్ గేమ్లో భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి. అయితే భద్రతా సమస్యలను పేర్కొంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్ మ్యాచ్ కు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు.
భారత తో పాక్ పర్యటన అక్కడి ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉంటుంది. అయితే PCB తమ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పత్రాలను పంపింది. పరిస్థితి సున్నితత్వం,ప్రభుత్వం చెప్పే వివరాల ఆధారంగా పీసీబీ నిర్ణయం తీసుకుంటుంది. టూర్ షెడ్యూల్ను అధ్యయనం చేయడానికి PCBకి గడువు ఇచ్చింది. ప్రపంచ కప్కు సంబంధించిన క్రికెట్ విషయాలను పాకిస్తాన్ బోర్డు సమీక్షిస్తుంది. అయితే భద్రత, ఇతర సమస్యలకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వం, సంబంధిత ఇతర ఏజెన్సీలు బాధ్యత తీసుకుంటాయి.
గత నెలలో ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే, సీఈవో జియోఫ్ అల్లార్డిస్ లాహోర్ పర్యటన సందర్భంగా పీసీబీ ఈ అంశాన్ని లేవనెత్తింది. ప్రపంచ కప్ అధికారిక షెడ్యూల్ WTC ఫైనల్ సమయంలో విడుదల చేయాల్సి ఉంది, అయితే BCCI ఆసియా కప్ 2023 కోసం వారి ‘హైబ్రిడ్ మోడల్’కు అంగీకరించకపోవడంతో PCB అభ్యంతరాలు చెబుతున్నది. .
ఆసియా కప్ PCB ప్రతిపాదిత ‘హైబ్రిడ్’ మోడల్తో ముందుకు సాగుతుంది. ఇంతలో, ఆసియా కప్ 2023 అధికారిక షెడ్యూల్ పాకిస్తాన్, శ్రీలంక రెండింటికీ ఆతిథ్యం ఇవ్వనున్న టోర్నమెంట్తో ధ్రువీకరరించింది. ‘మెన్-ఇన్-బ్లూ’ శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడనుంది. టోర్నమెంట్ ఆగస్టు 31న ప్రారంభం కానుంది, లాహోర్లో పాకిస్తాన్ నాలుగు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వగా, శ్రీలంక తొమ్మిది మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
|
ReplyForward
|






