
Rahul Dravid : టీం ఇండియా క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు కోచ్ గా ఇదే చివరి సిరీస్ అని ప్రకటించి షాక్ ఇచ్చాడు. రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం 2023 వరల్డ్ కప్ తో ముగియడంతో టీ 20 వరల్డ్ కప్ వరకు ద్రవిడ్ నే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
2023 వరల్డ్ కప్ లో టీం ఇండియా వరుసగా 10 మ్యాచుల్లో గెలిచి ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడి ఫ్యాన్స్ ను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. అయినా టీం ఇండియా ఫర్పామెన్స్ తో అందరూ ఖుఫీ అయ్యారు. విరాట్, రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి చలించిపోయారు. అందుకే టీ 20 వరల్డ్ కప్ సాధించాలని మీరు ఆడిన ఆట గ్రేట్ అంటూ పొగిడారు.
అయితే వరల్డ్ కప్ లో టీం ఇండియా పర్ఫామెన్స్ వెనక కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పోషించిన పాత్ర మరువలేనిది. యువకులను ఎంకరేజ్ చేస్తూ వారిలో కాన్పిడెన్స్ ను నింపడంలో సక్సెస్ అయ్యాడు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్ సమయంలో యువకులను ఎక్కవ మందిని టీంలోకి తీసుకొచ్చారు. యశస్వి జైశ్వాల్, సిరాజ్, ధ్రువ్ జురెల్, శుభమన్ గిల్, ఇలా చెప్పుకుంటూ పోతే టీం ఇండియాకు సెకండ్ ఇంటర్నేషనల్ టీంను తయారు చేశాడు. ఒకానొక సమయంలో సీనియర్ టీం, జూనియర్ టీం అని రెండు విభాగాల్లో పోటీ పడింది.
శిఖర్ దావన్ సారథ్యంలో శ్రీలంకలో ఒక టీం పాల్గొంటే మరో టీం ఇంగ్లండ్ లో టెస్టు మ్యాచులు ఆడింది. చైనాలో జరిగిన ఆసియాన్ గేమ్స్ లో యువకుల టీం పాల్గొంటే.. ఇండియాలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లు ఆడింది. ఇలా కోచ్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత రాహుల్ ద్రవిడ్ వేరే లెవల్ పర్ఫామెన్స్ చూపాడు. అయితే కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టాలని కోరినా ఆయన తిరస్కరించడంతోనే బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. టీం ఇండియా కోచ్ రేసులో గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ లు పోటీ పడుతున్నారు.