
ప్రస్తుత కాలంలో నిద్ర లేమి సమస్య వెంటాడుతోంది. రాత్రిళ్లు కొందరికి వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. కొందరు మాత్రం మంచం మీద అటు ఇటు దొర్లినా నిద్ర పట్టదు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. మనిషికి కంటి నిండ నిద్ర కడుపు నిండ తిండి లేకపోతే ఇబ్బందులే వస్తాయి. ఈనేపథ్యంలో నిద్ర సరిగా పట్టడానికి కొన్ని పరిహారాలు తీసుకోవాలి.
దీనికి మనం చేయాల్సిందేమిటంటే 200 గ్రాముల ఎండు ఖర్జూరాలు, 100 గ్రాముల బాదంపప్పు, 50 గ్రాముల గుమ్మడి గింజలు, 25 గ్రాముల గసగసాలు, పాలు తీసుకోవాలి. ఖర్జూరాలు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, గసగసాలు పొడి చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని కలిసేలా చేసుకోవాలి. అన్నం తిన్న తరువాత పడుకోవడానికి అరగంట ముందు వేడి పాలలో కలుపుకుని తాడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
ఇలా చేయడం వల్ల మంచి నిద్ర మన సొంతం అవుతుంది. మంచం ఎక్కగానే గాఢమైన నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది. మందులు వాడితే ఎలాంటి ప్రతిఫలం ఉండదు. అందుకే ఈ చిట్కా వాడటం వల్ల మనకు సుఖమైన నిద్ర సొంతమవుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ పౌడర్ ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవచ్చు.
నిద్ర లేమి సమస్య ఎక్కువగా ఉంటే ఈ చూర్ణాన్ని రెండు మూడు రోజులు వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర పట్టేందుకు కారణమవుతుంది. మంచి నిద్ర కోసం ఎంతో మంది తపిస్తున్నారు. వారందరికి ఈ చూర్ణం బాగా పనిచేస్తుంది. నిద్ర పట్టేందుకు పరోక్షంగా కారణమవుతుంది. నిద్ర లేమి సమస్యను దూరం చేస్తుంది. దీన్ని అందరు పాటించడం ఎంతో ఉత్తమం.






