పురాతన తవ్వకాల్లో చాలా వస్తువులు బయట పడ్డాయి. ఎన్నో వేల ఏళ్లనాటి దేవుళ్లకు సంబంధించినవి బయట పడటం మామూలే. అలా జరిపిన తవ్వకాల్లో ఓ త్రిశూలం, వజ్రాయుధం బయటపడ్డాయి. అది మన దేశంలో కాదు పిలిప్పీన్స్ లోని కాపర్ గోల్డ్ మైనింగ్ లో తవ్వకాలు చేపట్టినప్పుడు అనుమానాస్పదంగా ఉన్న రెండు వస్తువులు దొరకడంతో వాటిని కడిగి చూడగా త్రిశూలం, వజ్రాయుధం గా కనిపించాయి.
పదివేల ఏళ్ల నాటి త్రిశూలం, మూడు వేల ఏళ్లనాటి వజ్రాయుధాన్ని బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ శామీర్ హుస్సేన్ ప్రెస్ క్లబ్ లో ప్రదర్శించారు. ఇవి 2015లో మే నెలలో పిలిప్పీన్స్ మైనింగ్ తవ్వకాల్లో ఈ త్రిశూలం బయటపడింది. 2012 నుంచి పిలిప్పీన్స్ పౌరులతో తవ్వకాలు చేపట్టినట్లు చెప్పాడు. దీంతో వీటికి సంబంధించిన వివరాలు అన్ని వివరించాడు.
హిందూ పురాణాల ప్రకారం ఈ రెండు వస్తువులు శివుడివి అయి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. పురావస్తు శాఖ మాజీ అధికారి వాటిని పురాతన వస్తువులుగానే తేల్చారు. హరప్పా, మెహంజొదారో వంటి ప్రదేశాల్లో మనకు ఎన్నో వస్తువులు లభించాయి. ఇప్పుడు ఈ వస్తువులు బయట పడటంతో అక్కడ ఇంకా ఇతర వస్తువులేమైనా దొరుకుతాయేమననే సందేహాలు వస్తున్నాయి.
శివుడి త్రిశూలం, వజ్రాయుధం రెండు దొరకడంతో అక్కడ ఇంకా శివుడి విగ్రహాలు కూడా ఉండొచ్చు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపితే ఇంకా కొన్ని వస్తువులు లభించే అవకాశం ఉంది. అక్కడి ప్రభుత్వం స్పందించి ఇంకా తవ్వకాలు చేపట్టి దాగిన వస్తువులు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఇంకా మట్టిలో ఏ వస్తువులు దొరుకుతాయో తెలియడం లేదు.






