
Vikrant : పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత నౌకాదళం సముద్రంలో దూకుడుగా చర్యలు చేపట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన అత్యాధునిక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో మోహరించడంతో పాకిస్తాన్ కు సాగర దిగ్భందం సాక్షాత్కారమవుతోంది. విక్రాంత్తో పాటు సబ్మెరైన్లు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు లాంటి యుద్ధ నౌకల సమూహమైన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (CBG) రంగంలోకి దిగింది. పాక్ వ్యూహాత్మక రేవులు కరాచీ, గ్వాదర్లను టార్గెట్గా చేసేందుకు భారత్ సిద్ధమవుతోందని విశ్లేషకుల అభిప్రాయం.
పాక్ వాణిజ్యంలో 60 శాతానికి పైగా ఈ రేవులపై ఆధారపడటం, సముద్ర మార్గంలో చమురు దిగుమతులు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం వంటివి దీని తీవ్రతను పెంచుతున్నాయి. విక్రాంత్పై ఉన్న మిగ్-29కె యుద్ధవిమానాలు పాక్ సైనిక స్థావరాలపై ఖచ్చితంగా దాడులు చేయగలవు. మరోవైపు పాక్ నేవీకి విస్తృత శక్తి లేకపోవడం, ఆధునికీకరణ నత్తనడకన సాగడం భారత దిగ్భందాన్ని ఎదుర్కోవడంలో బలహీనతగా మారింది. తాజా చర్యలన్నీ పాక్ కు సముద్రపరంగా గట్టి హెచ్చరికగా నిలుస్తున్నాయి.