డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ” ప్రాజెక్ట్ – K ”. మహానటి వంటి క్లాసిక్ హిట్ ను ఇచ్చిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. బాహుబలి రెండు భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ప్రాజెక్ట్ – కె చిత్రం కూడా రెండు భాగాలుగా రానుందని షికారు చేస్తుండటంతో ఎట్టకేలకు ఆ చిత్ర బృందం స్పందించింది. ప్రాజెక్ట్ – కె పై వస్తున్న పుకార్లను ఖండించింది. ప్రాజెక్ట్ – K కేవలం ఒక భాగంగా మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది టీమ్.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా నాగ్ అశ్విన్ బృందం చాలా కష్టపడుతోంది. ఆమధ్య కథలో కీలకమైన టైర్ కోసం చిత్ర బృందం ఎంతగా కస్టపడిందో చెప్పకనే చెప్పే ఓ వీడియో రిలీజ్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.