
తమిళ హీరో శింబు నటించిన పత్తు తల చిత్రం చూడటానికి సంచార జాతి కి చెందిన కొందరు తమిళనాడు లోని కోయంబేడు లో గల రోహిణి థియేటర్ కు వచ్చారు. టికెట్లను కొనుగోలు చేశారు కూడా. అయితే వాళ్ళను లోపలకు అనుమతించలేదు థియేటర్ సిబ్బంది. అందుకు కారణం వాళ్ళు సంచార జాతికి చెందిన వాళ్ళు కావడమే. దాంతో టికెట్ కొన్న మహిళ సదరు థియేటర్ సిబ్బందిని ప్రశ్నించింది. టికెట్ తీసుకొని వెళ్తున్న మిగతవాళ్లను లోపలకు పంపిస్తున్నారు మమ్మల్ని మాత్రం ఎందుకు ఆపుతున్నారు …… మేము కూడా టికెట్లు కొన్నాం కదా ….. అని ప్రశ్నించింది. దాంతో కొంతమంది ఈ వ్యవహారాన్ని చిత్రీకరించారు.
కట్ చేస్తే ఇప్పుడు ఒక్క తమిళనాడులోనే కాదు యావత్ భారతదేశంలో ఈ సంఘటన కలకలం రేపింది. దాంతో లోక నాయకుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించాడు. సంచార జాతి వాళ్ళని చులకనగా చూడటం మానండి……టికెట్ కొన్న తర్వాత కూడా వాళ్ళను లోపలకు పంపించకుండా అవమానించడం అన్నది క్షమించరాని నేరం అంటూ రోహిణి థియేటర్ సిబ్బందిపై అలాగే యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కమల్ కు తోడుగా సినిమారంగంలోని మిగతా సెలబ్రిటీలు కూడా గొంతు కలిపారు. మొత్తానికి ఈ వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. సమాజంలో ఇప్పటికి కూడా నిమ్న జాతుల పట్ల అహంకారంతో వ్యవహరిస్తున్నారు కొంతమంది. దాంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.






