బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ” కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ”. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ సాంగ్ లో కొద్దిసేపు మెరవనున్నాడు. సల్మాన్ ఖాన్ కుటుంబానికి వెంకీ కుటుంబం అలాగే మెగా కుటుంబం చాలా క్లోజ్ దాంతో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ఇక హీరోయిన్ గా హాట్ భామ పూజా హెగ్డే నటిస్తోంది.
ఈరోజు ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది. దాంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఈ చిత్ర ట్రైలర్ చూసి ఖుషీ అవుతున్నారు. కొత్తగా ఏమి లేదు కాకపోతే మాస్ మాసాలా ప్రేక్షకులను అలరించేలా యాక్షన్ , సెంటిమెంట్ , ఎంటర్ టైన్ మెంట్ లను కలగలిపి రూపొందించారు ఈ చిత్రాన్ని. సల్మాన్ నుండి కోరుకునే అంశాలు ఇవే కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే వెంకీ , చరణ్ లు కూడా ఈ సినిమాలో కనిపించడం. జగపతి బాబు విలన్ గా నటించడం విశేషం. అయితే వెంకీ అభిమానులు ఈ ట్రైలర్ చూసి కాస్త బాధపడటం ఖాయం ఎందుకంటే విలన్ల చేతిలో దెబ్బలు తింటుంటే సల్మాన్ వచ్చి వెంకీ ని కాపాడటం అంటే తెలుగు ప్రేక్షకులకు కాస్త రుచించని అంశమనే చెప్పాలి.
సల్మాన్ ఖాన్ సొంత సినిమా ఇది. ఫర్హాద్ సమ్ జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈద్ సందర్బంగా ఈనెల 21 న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గతకొంత కాలంగా బాలీవుడ్ లో ఇతర బాషా చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో సల్మాన్ సినిమా ఆ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని భావిస్తున్నారు.