
నువ్వొక వేశ్య ….. అలాగే బ్రతకడానికి అలవాటు పడ్డావ్. అలాంటప్పుడు ఎందుకు భయపడతావు ? అంటూ హీరోయిన్ రియా చక్రవర్తి పై సంచలన ట్వీట్ చేసింది దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి ప్రియాంకా సింగ్. తాజాగా రియా చక్రవర్తి ఓ షో లో పాల్గొని మళ్లీ నటనపై దృష్టి పెట్టానని , పోయిన వాళ్ళను తలుచుకుంటూ ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోలేము కదా అంటూ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి ప్రియాంకా సింగ్ ను తీవ్రంగా కలిచి వేసాయి. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో ? దానికి కారకులు ఎవరో నాకు తెలుసు …… నువ్ ఎవరి అండ చూసుకొని మాట్లాడుతున్నావో కూడా తెలుసు ….. నువ్వొక వేశ్య వు. అలా వేశ్యలా బ్రతకడానికి అలవాటు పడ్డావ్ కాబట్టి అలా కాక ఎలా బ్రతుకుతావు అంటూ రియా చక్రవర్తి పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేసింది ప్రియాంకా సింగ్.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోయిన్ రియా చక్రవర్తి ప్రేమించుకున్న విషయం తెలిసిందే. కలిసి సహజీవనం కూడా చేసారు. అయితే సుశాంత్ తో కొన్నాళ్ళు సహజీవనం చేసిన రియా చివరి రోజుల్లో మాత్రం అతడ్ని కాస్త దూరం పెట్టిందట. ఆ సమయంలోనే తీవ్ర మానసిక ఒత్తిడి తో సుశాంత్ మరణించాడు. ఇప్పటికి సుశాంత్ మరణించి మూడేళ్లు పూర్తి అయినప్పటికీ విచారణ మాత్రం పూర్తిగా సాగలేదు. సుశాంత్ ది హత్య ? ఆత్మహత్య నా ? అనేది తేలలేదు. దాంతో సుశాంత్ సింగ్ కుటుంబం తీవ్ర మానసిక వ్యధతో రగిలిపోతోంది. అందుకే ఆవేశంలో రియా పై సంచలన ట్వీట్ చేసింది.






