
అవతార్ ఫీవర్ తో ఊగిపోతున్నారు ప్రేక్షకులు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 16 న విడుదల అవుతోంది. 2009 లో వచ్చిన అవతార్ వసూళ్ల వర్షం కురిపించింది. కనీవినీ ఎరుగని ప్రభంజనం సృష్టించింది. దాంతో రెండో పార్ట్ గా వస్తున్న అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రం కోసం చాలా జాగ్రత్తలే తీసుకున్నారు మల్టీప్లెక్స్ ఓనర్లు. ఇండియాలో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న అన్ని మల్టీప్లెక్స్ లలో కూడా అన్ని షోలు కేవలం అవతార్ షోలు మాత్రమే పడనున్నాయి. మల్టీప్లెక్స్ లలో 2 నుండి 10 స్క్రీన్ ల వరకు ఉండగా అన్నింట్లో కూడా అవతార్ షోలు పడనున్నాయి.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఆ డిమాండ్ కు తగ్గట్లుగానే అన్ని స్క్రీన్ లను ఏర్పాటు చేసారు. ఎక్కువ షోలు వేస్తున్నారు. సాధారణంగా నాలుగు షోలు మాత్రమే పడుతుంటాయి. కానీ అవతార్ కున్న డిమాండ్ దృష్ట్యా ఈ సంఖ్యను పెంచారు. మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ అవతార్. ఇక సినిమా విడుదల అయ్యాక రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.