
తమిళ స్టార్ హీరో సూర్య కుటుంబం ముక్కలైంది. హీరో సూర్య , అలాగే తమ్ముడు కూడా హీరో అయినా కార్తీ లతో పాటుగా తన తల్లిదండ్రులతో కలిసి చెన్నై లోని పెద్ద ఇంట్లో ఉండేవారు. ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఒకప్పుడు భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. అయితే 80 వ దశకం నుండి ఉమ్మడి కుటుంబం వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. కుటుంబంలో ఆడవాళ్ళ మధ్య గొడవలతో వేరు కాపురాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు.
అలాంటి సమయంలో ఉమ్మడి కుటుంబంగా మెలిగారు సూర్య , కార్తీ . సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే కార్తీ తన మరదలును పెళ్లి చేసుకున్నాడు. దాంతో సూర్య , కార్తీ తన భార్య పిల్లలతో కలిసి అలాగే తల్లిదండ్రులతో కలిసి చెన్నై లోని పెద్ద ఇంట్లో ఉండేవారు. అయితే ఉమ్మడి కుటుంబంలో సహజంగానే మనస్పర్థలు రావడం సహజం. అలాగే హీరో సూర్య కుటుంబంలో కూడా మనస్పర్థలు చెలరేగాయి.
అవి చిలికి చిలికి గాలివానలా మారడంతో సూర్య వేరు కాపురం పెట్టాడు. ముంబై లో 70 కోట్లు పెట్టి ఓ అధునాతనమైన భవంతి కొన్నాడు. కొన్నాళ్లుగా ముంబైలోనే ఉంటున్నాడు సూర్య. ఇక చెన్నై లోని ఇంట్లో తల్లిదండ్రులు అలాగే తమ్ముడు కార్తీ కుటుంబం ఉంటోంది. తమ కొడుకులు , కోడళ్ళు , మనవళ్లు , మనవరాండ్లు అందరూ తమ కళ్ళ ముందే ఉండాలని ఆశించారు సూర్య పేరెంట్స్ కానీ వాళ్ళ ఆశలు అడియాసలే అయ్యాయి. దాంతో వాళ్ళు చాలా బాధపడుతున్నారట. అయితే సూర్య మదిలో ఏముందంటే …… కలిసి ఉండి అస్తమానం గొడవలు పడటం కంటే విడిగా ఉండటం వల్లే ప్రేమలు ఉంటాయని భావిస్తున్నాడట. అందుకే వేరు కాపురం పెట్టాడట.






