అక్కినేని నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు యాక్టింగ్ మానేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సంచలన నిర్ణయం ఎందుకో తెలుసా …………. ప్రేక్షకుల నాడి తెలుసుకోవడానికేనట. ఈ ఆరు నెలల పాటు కూడా ఓటీటీ లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి. వేటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అనే అంశాలను పరిశీలించనున్నారట నాగార్జున.
ఆరు నెలల పాటు యాక్టింగ్ మానేసి ఓటీటీ మూవీస్ చూసి అప్పుడు కథలు వింటారట. విన్న కథలు ఓటీటీ కి సరిపోతాయా ? లేదంటే థియేటర్ లలో రిలీజ్ చేయాలా ? అనేది డిసైడ్ చేస్తారట నాగార్జున. తాజాగా నాగార్జున ది ఘోస్ట్ అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా అక్టోబర్ 5 న దసరా కానుకగా విడుదల అవుతోంది. ఈ సినిమా రిజల్ట్ కోసం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నాగార్జున.
ఇక ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ……. విజయవాడ ఎంపీగా నేను కానీ అమల కానీ పోటీ చేయడం ఖాయం అంటూ వార్తలు పుట్టుకొస్తుంటాయి. ప్రస్తుతం నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు …… పోటీ చేయాలన్నది అంతకన్నా లేదు అంటూ కుండబద్దలు కొట్టారు నాగార్జున.