
హాట్ భామ అనసూయను ఎవరైనా ఆంటీ అంటే చాలు టక్కున కోపం వస్తుంది అంతేకాదు చాలా సీరియస్ కూడా అవుతుంది. ఆంటీ అనే పదం మీద పెద్ద యుద్ధమే నడిచింది సోషల్ మీడియాలో. ఒకవైపు అనసూయ మరోవైపు అనసూయను టార్గెట్ చేసిన కొంతమంది నెటిజన్లు …… ఇలా మొత్తానికి పెద్ద యుద్ధమే జరిగింది. అంతేనా ……. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్ళింది.
కట్ చేస్తే …… ఇప్పుడు అనసూయను ఎవరైనా ఆంటీ అంటే మాత్రం కోపం రావడం లేదట ! ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయ్ …. ఇలాంటి వాటి కోసం పనులను పక్కన పెట్టలేను , అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోలేను కూడా అందుకే ఆంటీ అని ఎవరైనా అన్నా కూడా బాధ , కోపం రావడం లేదని సెలవిచ్చింది.
అనసూయ రెగ్యులర్ గా ట్విట్టర్ లో అలాగే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు పెట్టడమో లేదంటే నెటిజన్ల తో తన అభిప్రాయాలను పంచుకోవడమో చేస్తుండేది. అలాగే తాజాగా ఇన్ స్టాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చిందన్న మాట. బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న ఈ భామ వెండితెరపై సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే ఆశించిన స్థాయిలో అయితే విజయాలు దక్కడం లేదు.






