
చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ” బలగం”. కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు వారసులు నిర్మించిన సంగతి తెలిసిందే. మార్చి 3 న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఇక రోజు రోజుకు మౌత్ టాక్ బాగా పెరగడంతో వసూళ్ల వర్షం కురిసింది.
24 రోజుల్లో మొత్తంగా 25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది బలగం. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 25 కోట్ల వసూళ్లను సాధించడం అంటే మాములు విషయం కాదు. ఇక థియేట్రికల్ గానే 25 కోట్ల వసూళ్లను సాధించిన ఈ చిత్రం శాటిలైట్ , డిజిటల్ , OTT , ఆడియో రైట్స్ రూపంలో మరో 15 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వసూల్ చేసింది. అంటే నిర్మాతకు భారీగా లాభాలు అన్నమాట.
ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ , వేణు , సుధాకర్ రెడ్డి, రూప తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా థియేటర్ లలో రన్ అవుతున్న బలగం అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయినప్పటికీ అక్కడ , ఇక్కడా సూపర్ హిట్ గా దూసుకుపోతూనే ఉంది. బలగం వంటి బ్లాక్ బస్టర్ ను తనకు ఇవ్వడంతో దర్శకుడు వేణు కు తన బ్యానర్ లోనే మరో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు దిల్ రాజు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రం అట.






