నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 6 షోను నిలిపివేయాలని కోరుతూ ఏపీ లోని హైకోర్టుని ఆశ్రయించారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. బిగ్ బాస్ షో చాలా అశ్లీలంగా ఉంటోందని , అలాగే అందులోని పార్టిసిపెంట్స్ చాలా దారుణమైన బూతులు మాట్లాడుతున్నారని అలాంటి షోను రద్దు చేయాలని లేదంటే కేవలం రాత్రి 11 గంటల తర్వాత తెల్లవారు ఝామున 5 గంటలలోపు మాత్రమే పూర్తి అయ్యేలా ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అందుకు విరుద్దంగా ఉదయం , సాయంత్రం రిపీట్ వేస్తూ యువత చెడిపోవడానికి కారణం అవుతోందని దుయ్యబట్టారు. పిల్ దాఖలు కావడంతో విచారణకు ఏపీ హైకోర్టు స్వీకరించింది. దాంతో బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు రావడం ఖాయమని భావిస్తున్నారు. ఇక ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీపీఐ నారాయణ బిగ్ బాస్ షోను మాత్రమే కాదు ఏకంగా నాగార్జునని కూడా దారుణంగా విమర్శించిన సంగతి తెలిసిందే.