ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ క్రేజ్తో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి టైగర్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందా.. అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్ల ఊహాకు తగ్గట్టే ఎన్టీఆర్ 30ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. సముద్రం బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్లో కొరటాల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో షూటింగ్ను పూర్తి చేశారు. సెకండ్ షెడ్యూల్ కి అంతా రెడీ అవుతున్న టైంలో బయటకు వచ్చిన ఓ క్రేజీ న్యూస్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈమూవీ కోసం పవర్ ఫుల్ విలన్ దిగబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ ను ఢికొట్టబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అదే సమయంలో మూవీ నుంచి తప్పుకున్నట్లు పుకార్లు షికారు కూడా చేశాయి. అయితే అలాంటి గాసిప్ వార్తలకు చెక్ పడింది. ఫైనల్ గా సైఫ్ ఎన్టీఆర్ 30 సెట్ లో అడుగుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్ తో పాటు సైఫ్ అలీఖాన్, ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలోని మృగాలను భయపెట్టేందుకు.. హీరో ఏం చేశాడో.. తారక్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. ఈ సినిమాలో డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట ఎన్టీఆర్. నెవర్ బిఫోర్ మాస్ రోల్లో కనిపించబోతున్నాడట. అది కూడా డ్యూయల్ రోల్ చేస్తున్నాడట ఎన్టీఆర్. తండ్రి కొడుకుగా నటిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ రెండు క్యారెక్టర్స్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందట. ఎన్టీఆర్ క్యారెక్టర్స్ వేరియేషన్ కోసం కొరటాల కాస్త గట్టిగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడట. మొత్తంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా.. ఎన్టీఆర్ని ప్రజెంట్ చేయబోతున్నాడు కొరటాల. దీంతో ఎన్టీఆర్ 30పై అంచనాలు పెరిగిపోతున్నాయి