సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న యశస్వి అనూహ్యంగా చీటింగ్ వివాదంలో ఇరుక్కున్నాడు. నవసేవ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి నాలుగేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని , ఆ సంస్థలో దాదాపు 56 మందిని చదివిస్తున్నానని ఇటీవల ఓ షోలో పేర్కొన్నాడు. అదే వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. నవసేవ అనే సంస్థకు సింగర్ యశస్వికి ఎలాంటి సంబంధం లేదని , అది నేను కొంతమంది ఆర్థిక సహకారంతో నడిపిస్తున్నానని మీడియా ముందుకు వచ్చింది ఫరా కౌసర్.
మా స్వచ్ఛంద సంస్థతో సంబంధం లేకుండా , మా సంస్థకు ఆర్ధిక సహకారం చేయకుండా నేను 56 మందిని చదివిస్తున్నానని ఎలా చెప్పుకుంటాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఫరా కౌసర్. ఈ విషయం తెలిసి పలువురు సింగర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యశస్వి ఇలా ఎందుకు చేసాడు ……. చేయని పనులను చేస్తున్నట్టుగా ఎందుకు చెప్పుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇంత రాద్ధాంతం జరుగుతున్నా సింగర్ యశస్వి మాత్రం నోరు మెదపడం లేదు ……. వివరణ ఇవ్వడం లేదు దాంతో మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న యశస్వి అనవసరంగా వివాదంలో ఇరుక్కున్నాడని , చేయని పనులను గొప్పకు పోయి చెప్పుకుని అబాసుపాలయ్యాడని నవ్వుకుంటున్నారు.