నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఆగస్టు 13 న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ లభించడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లను వసూల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్ లో 10 కోట్ల వసూళ్లు సాధించింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్ సీస్ , బాలీవుడ్ అన్నీ కలిపి 65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వసూల్ చేసింది. రాబోయే రోజుల్లో అవలీలగా 100 కోట్లకు పైగా వసూల్ చేయడం ఖాయమని అంటున్నారు. ఓవరాల్ గా లాంగ్ రన్ లో 150 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించగా కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ , శ్రీనివాస రెడ్డి తదితరులు నటించారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది. తెలుగునాట సీక్వెల్ లకు అంతగా కలిసి రాలేదు. బాహుబలి సిరీస్ తర్వాత కార్తికేయకు ఇలా కలిసి వచ్చింది. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ కావడంతో నిఖిల్ తో పాటుగా చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురుస్తోంది.