బింబిసార డైరెక్టర్ వశిష్ఠపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. బింబిసార డైరెక్టర్ పై మెగా ఫ్యాన్స్ కు కోపం ఏంటి ? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా ? అసలు కారణం ఏంటంటే ……. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ని కొంతమంది ట్రోల్ చేసారు. కాగా ఆ ట్వీట్ ను లైక్ కొట్టాడట బింబిసార డైరెక్టర్ వశిష్ఠ.
ఇంకేముంది ఈ విషయాన్ని పసిగట్టారు మెగా అభిమానులు. అంతే డైరెక్టర్ విశిష్ట పై విమర్శలు ఎక్కుపెట్టారు. మెగా అభిమానుల తాకిడికి బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తట్టుకోలేకపోయాడు. దాంతో తన ప్రొఫైల్ ను లాక్ చేసాడు. ప్రస్తుతం వశిష్ఠ ట్విట్టర్ ఎకౌంట్ లాక్ లో ఉంది. అంటే దాన్ని మెగా అభిమానులు టచ్ చేయలేరు అన్నమాట.
రాంచరణ్ ని విమర్శించిన విశిష్ట తో మీరు సినిమా చేయొద్దు ….. అతడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవద్దు అంటూ మెగాస్టార్ చిరంజీవిని వేడుకుంటున్నారు మెగా అభిమానులు. ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవికు డైరెక్టర్ వసిష్ఠ కథ చెప్పినట్లుగా దానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో అతడితో సినిమా చేయొద్దు ….. మన రాంచరణ్ ను అవమానించాడు అంటూ ఫైర్ అవుతున్నారు.