ప్రముఖ సంగీత దర్శకుడు MM Keeravani కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని కీరవాణి స్వయంగా వెల్లడించడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అందుకున్నాడు కీరవాణి. దాంతో ఇండియా నుండి అమెరికాకు అలాగే అక్కడ పలుచోట్ల పలు ప్రాంతాల్లో తిరిగాడు. వేలాదిమందిని కలిసాడు. అలాగే ఆస్కార్ ను అందుకొని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వందలాది మందిని కలిసాడు. ఇంకేముంది కరోనా అంటుకుంది.
కీరవాణికి ఒంట్లో నలతగా ఉంటే కోవిడ్ – 19 టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్ట్ లో పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించాడు కీరవాణి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో కీరవాణిని కలిసిన వాళ్ళు కరోనా టెస్ట్ చేయించుకునే పనిలో పడ్డారు.