
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె తండ్రి లక్ష్మీ నారాయణ (90 ) మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీ నారాయణ మంగళవారం మరణించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం లోని గాద రాడ లక్ష్మీ నారాయణ స్వగ్రామం. హోమియో వైద్యుడిగా పని చేసారు లక్ష్మీ నారాయణ. ఆ చుట్టుపక్కల గ్రామాలలో హోమియో వైద్యుడిగా లక్ష్మీ నారాయణకు మంచి పేరు ఉంది. తండ్రి మరణంతో రఘు కుంచె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈరోజు లక్ష్మీ నారాయణ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రఘు కుంచె తండ్రి మరణంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.






