నయనతార తమిళనాడు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. నేను – విఘ్నేష్ శివన్ ఆరేళ్ళ క్రితమే పెళ్లి చేసుకున్నామని అందుకు సాక్ష్యం రిజిస్టర్ మ్యారేజ్ కు సంబందించిన ఆధారాలు ఇవే అంటూ ప్రభుత్వానికి ఇచ్చారు. దాంతో షాక్ అవ్వడం ప్రభుత్వ వంతు అయ్యింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ……. ఇటీవలే నయనతార – విఘ్నేష్ శివన్ లు సరోగసీ ద్వారా ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చారు. దాంతో వాళ్ళు సరోగసీ నిభందనలు పాటించారో లేదో అని ఓ కమిటీని నియమించింది తమిళనాడు ప్రభుత్వం.
దాంతో వాళ్ళు నయనతార కు నోటీసులు ఇవ్వగా …… మాకు ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని , ఆరేళ్లుగా మాకు పిల్లలు కాకపోవడంతో మా బంధువు అమ్మాయి ని అద్దె గర్భం కోసం ఎంపిక చేసుకున్నామని , నియమాలను ఇల్లంఘించి ఎలాంటి పనులు చేయలేదని అఫిడవిట్ సమర్పించింది నయనతార. దాంతో షాక్ అవ్వడం అందరి వంతు అయ్యింది.