
మెగా డాటర్ నిహారిక తాజాగా చేసిన ఎక్స్ పోజింగ్ మెగా అభిమానులను షాక్ అయ్యేలా చేస్తోంది. డెనిమ్ జీన్స్ లో నిహారిక చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. నిహారిక ఫోజులు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దాంతో నిహారికను ట్రోల్ చేస్తున్నారు. నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చింది అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.
ఒకవైపు జొన్నలగడ్డ చైతన్య తన ఇన్ స్టాగ్రామ్ లో నిహారికకు సంబందించిన ఫోటోలు డిలీట్ చేసాడు. అలాగే మరోవైపు నిహారిక కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో నుండి చైతన్య ఫోటోలను డిలీట్ చేసింది. దాంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఎన్ని ఊహాగానాలు వస్తున్నా వాటికీ సమాధానం ఇవ్వకపోగా ఇలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో మరిన్ని విమర్శలు వచ్చి పడుతున్నాయి.
ఇక ఈ విషయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించడం లేదు. రాజకీయంగా రకరకాల విమర్శలు చేస్తూనే ఉన్నాడు కానీ నిహారిక పై వస్తున్న రూమర్స్ గురించి మాత్రం నోరు మెదపడం లేదు. ఇక నిహారిక కొత్తగా ప్రొడక్షన్ ఆఫీస్ ను ప్రారంభించింది. నిహారిక పలు వెబ్ సిరీస్ లను సినిమాలను నిర్మించాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో OTT వైపు మళ్లింది.






