యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఆస్కార్ అవార్డుల కోసం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళ్లిన ఎన్టీఆర్…… ఆస్కార్ అందుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఆస్కార్ ప్రకటించిన సమయంలో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయని , జక్కన్న మొహం లో పట్టరాని ఆనందాన్ని చూశానని …… ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేమన్నాడు. ఆస్కార్ ప్రకటన వచ్చిన తర్వాత నా భార్యకు ఫోన్ చేసి నా ఆనందాన్ని పంచుకున్నానని తెలిపాడు ఎన్టీఆర్.
తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ , వసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా ఈనెలలోనే ప్రారంభం కానుంది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఏప్రిల్ నుండి జరుగనుంది.