జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళాడు. కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దలు అమిత్ షా , జేపీ నడ్డా లతో సమావేశం ఉందని సమాచారం అందించారు. దాంతో కేంద్ర పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లాడు పవన్. ఇటీవల కాలంలో బీజేపీకి కాస్త అంటీముట్టనట్లుగా ఉంటున్నాడు జనసేనాని. దాంతో బీజేపీ పెద్దలు పిలిపించినట్లు తెలుస్తోంది.
మేలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు కూడా ఉన్నారు. దాంతో ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే పవన్ కళ్యాణ్ ను పిలిపించినట్లు తెలుస్తోంది. పవన్ పిలుపుతో హైదరాబాద్ లో ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్ళాడు. ఏపీలో జనసేన – బీజేపీ పొత్తులో ఉన్నాయి….. కానీ ఆ పొత్తు ఆశించిన స్థాయిలో లేదు. దాంతోనే ఈ సమావేశం అని తెలుస్తోంది.