
అతిలోక సుందరి తనయకు అదృష్టం బాగా కలిసొస్తున్నట్టుగా కనిపిస్తోంది. టాలీవుడ్ లోకి అలా అడుగుపెట్టిందో లేదో అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు నిర్మాతలు తమ సినిమాల్లో నటించాలని బ్యూటీ వెంట పడుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ ఖాతాలో మరో క్రేజీ ఛాన్స్ వచ్చిపడినట్టుగా తెలుస్తోంది.
శ్రీదేవి వారసురాలిగా ధడక్ సినిమాతో 2018లో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది జాన్వీ. ఆ తర్వాత చాలా సినిమాలే చేసింది కానీ స్టార్స్ పక్కన కమర్షియల్ చిత్రాల్లో ఆఫర్స్ రాలేదు. ఈ క్రమంలో యంగ్ టైగర్ అప్ కమింగ్ మూవీలో పిలిచి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలో బ్యూటీ ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ లో తెలిసిపోయింది. దానికి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ వచ్చింది. దీంతో మిగిలిన నిర్మాతలు కూడా ఇప్పటి నుంచే ఆమెకోసం కర్చీప్ వేసుకుంటున్నారు.
ఇకపోతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనకు జోడీగా జాన్వీ కావాలంటున్నాడని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేయనున్న మూవీలో హీరోయిన్ గా జాన్వీని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ ముద్దుగుమ్మతో చర్చలు జరపగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు కూడా ఒకే అయితే.. జాన్వీ రేంజ్ మరింత పెరిగిపోయినట్టే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీ హంగామా మొదలైందని చర్చించుకుంటున్నారు.






