షాకింగ్ అనూహ్యంగా రంగమార్తాండ ఓటీటీలోకి వచ్చేసింది ఈరోజే. ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం , రమ్యకృష్ణ , అనసూయ , శివాత్మిక రాజశేఖర్ , రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించిన చిత్రం ” రంగమార్తాండ ”. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 22 న విడుదల అయ్యింది.
ఈ సినిమా హృదయాలను హత్తుకునేలా ఉండటంతో పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిసింది. పలువురు సెలబ్రిటీలు రంగమార్తాండ పై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ప్రశంసలు దక్కాయి కానీ కాసుల వర్షం కురవలేదు …… థియేటర్ లలో ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. దాంతో కాబోలు వెంటనే ఓటీటీ లో విడుదల చేసారు.
ఇంతకీ ఈ రంగమార్తాండ చిత్రం ఎందులో విడుదల అయ్యిందో తెలుసా ……. అమెజాన్ ప్రైమ్ లో . అవును అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దాంతో అందరూ షాక్ అవుతున్నారు ఎందుకంటే రెండు వారాలు పూర్తి కాగానే ఇలా స్ట్రీమింగ్ కి రావడం సంచలనంగా మారింది. కృష్ణవంశీ , ప్రకాష్ రాజ్ లు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే ఆ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.