
తమిళనాడులోని పలని మురుగన్ స్వామి దేవాలయాన్ని దర్శించుకుంది స్టార్ హీరోయిన్ సమంత . గతకొంత కాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స పొందిన విషయం తెలిసిందే. కాగా ఆ వ్యాధి నుండి కోలుకోవడంతో పాటుగా మరింత ఆరోగ్యంగా ఉండాలంటే పలని మురుగన్ స్వామికి పూజలు చేయాలని చెప్పడంతో పూజలు నిర్వహించింది. అంతేకాదు పలని మురుగన్ స్వామి టెంపుల్ ఎక్కాలంటే మొత్తం 600 మెట్లు ఎక్కాలి.
దాంతో ఒక్కో మెట్టుకు హారతి ఇచ్చి పూజలు చేయడం విశేషం. ఇలా మొత్తంగా 600 మెట్లకు హారతులు ఇచ్చి పూజలు చేసింది. 600 మెట్లకు పూజలు నిర్వహించడం అంటే మాటలు కాదు…… ఎంతో ఓపిక ఉండాలి. తన సిబ్బందితో కలిసి సమంత ఈ పూజలు చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత మెట్లకు పూజలు చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది. ఆ రోగం నయం కావాలంటే ఇలా పూజలు చేయాలని సూచించడంతో గుళ్లు , గోపురాలు తిరుగుతోంది. శాకుంతలం అనే సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇక షూటింగ్ గ్యాప్ లో ఇలా దైవ దర్శనం చేసుకుంటోంది.