నటి , ఫిల్మ్ మేకర్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లోఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. కొందరు వ్యక్తులు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అందులో కొన్ని దూరం జరగడం బాధిస్తుందని అభిప్రాయపడ్డారు. విమానంలో ప్రయాణిస్తున్న వీడియోను పెట్టి, నోట్ పెట్టారు.
కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారని, వాళ్ల పరిచయం మండు వేసవిలా ఉంటుందని, వాళ్ల చూపులు నేరుగా మన హృదయంతో మాట్లాడుతాయని, అదో అందమైన భాష, వాళ్లతో కొన్ని గంటల సమయం గడిపినప్పటికీ వాళ్ల ప్రభావం మన జీవితం పైన ఉంటుందని, మన పైన వారిశాశ్వత ముద్ర ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి పరిచయాలలో కొన్ని మనల్ని బాధపెడుతుంటాయని రాశారు. అలాంటి వారు మన జీవితానికి పరిపూర్ణతను ఇస్తారని, మన కన్నీళ్లను తుడిచి, మన జీవితంలో వెలుగులు నింపుతారని, నవ్విస్తుంటారని రాసుకొచ్చారు.
రేణు దేశాయ్ దీనిని యాదృచ్చికంగా రాసి ఉండవచ్చు. నెటిజన్లు స్పందిస్తున్నారు. రేణుకు ఇది వరకు ఓ వ్యక్తి దొరికినట్లుగా వార్తలు రావడతో పాటు ఆమె రెండో పెళ్లి చేసుకొని, సెటిల్ అయిపోతుందనే పుకార్లు షికారు చేశాయి. కానీ అదేం జరగలేదు. రేణు తన ఇద్దరు పిల్లలు అకీరా , ఆద్యల చూసుకుంటోంది. ఇటీవల తనయుడు అకీరాతో కలిసి ఆమె ప్రయాణిస్తోన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ వెండితెర పైన మళ్లీ కనిపించనున్నారు. పద్దెనిమిదేళ్ల విరామం తర్వాత రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటిస్తున్నారు. హేమలతా లవణం అనే పాత్రలో అమె నటిస్తున్నారు.
View this post on Instagram