
మహా నటులు నందమూరి తారకరామారావు , ఎస్వీ రంగారావు , సావిత్రి , రేలంగి తదితరులు నటించిన సంచలన చిత్రం నర్తనశాల. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1963 లో విడుదలై సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో బృహన్నల పాత్రలో నటించడం హైలెట్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ లాంటి స్టార్ బృహన్నల గెటప్ వేయడం సాహసం అనే చెప్పాలి. అంతేకాదు బృహన్నల గెటప్ లో ఎన్టీఆర్ అభినయం , వాచకం నభూతో నభవిష్యత్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఎస్వీఆర్ , సావిత్రి అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయా పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేశారు. అందుకే మహా నటులు , మహానటి అయ్యారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
నర్తనశాల సినిమాకు నటీనటుల అభినయానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో …… అంతే ప్రాధాన్యత ఘంటసాల గాత్రానికి ఉంది. సుమధురంగా పాటలను , పద్యాలను అలపించి ప్రేక్షకులను అలరించారు ఘంటసాల. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఘంటసాల ఆలపించిన పాటలు, పద్యాలకు ఎన్టీఆర్ అభినయం నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. ఇక నర్తనశాల చిత్రాన్ని రంగుల మయం చేశారు ఇటీవల. ఇక కలర్ లో ఎన్టీఆర్ చూడముచ్చటగా ఉన్నారు. కలర్ లో నర్తనశాల మరింత సుందరంగా ఉంది. ఈ వీడియో క్లిప్ మీకోసమే …… చూడండి ఆపాత మధురాన్ని…… ఆస్వాదించండి.