బుల్లితెర హాట్ యాంకర్ గా విష్ణుప్రియ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె యాంకరింగ్ అంటేనే కుర్రకారు హీటెక్కిపోతారనడంలో సందేహం లేదు. ‘పోవే పోరా’లో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకర్ గా చేసిన విష్ణుప్రియ అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక షోలో ఇరుక్కుపో హత్తుకొని ధీరా ధీరా అంటూ చేసిన పాటకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు. ఇక ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడంలో ప్రస్తుతం బిజీగా ఉంది. నాజూకైన ఆమె ఒంపులు, ఆకట్టుకునే ఆమె ఎద యువతకు గాలం వేస్తూనే ఉంటుంది. గ్లామర్ షోలలో ఈ యంగ్ బ్యూటీ ఎప్పుడూ బిజీగానే ఉంటుందని చెప్పాలి. తన గ్లామరష్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యువతను తనవైపునకు తిప్పుకుంటుంది. ప్రస్తుతం అమ్మడు వెండితెర వైపునకు అడుగులు వేస్తుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న ‘సిక్స్త్ సెన్స్’ (సీజన్ 5) మాటీవీలో కొనసాగుతుంది. ఈ షోకు ఇప్పటికే చాలా మంది స్టార్లు, నిర్మాతలు, దర్శకులు వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో విష్ణు ప్రియ కూడా ఈ షోకు వచ్చింది. ఆమెతో పాటు రవి కూడా వచ్చాడు. ఇందులో హోస్ట్ ఓంకార్ విష్ణుప్రియ లవ్ ఎఫైర్ గురించి అడిగాడు. సాధారణంగా తమ లవ్ ఎఫైర్, డేటింగ్ లాంటివి బయటపెట్టేందుకు నటీమణులు ఇష్టపడరు. అలాంటివి కొనసాగుతున్నా సింగల్ అనే చెప్తారు. కానీ ఇందుకు భిన్నంగా విష్ణుప్రియ మాత్రం తను పెళ్లయిన ఒక హీరోను ప్రేమించానని చెప్పింది. ఆయన ఎవరో చెప్పాలని ఓంకార్ అడిగితే..
తను జేడీ ఛక్రవర్తి అని చెప్పంది. తాను జేడీ ఛక్రవర్తిని లవ్ చేశాను.. ఇష్టపడ్డాను అని చెప్పింది విష్ణుప్రియ. ఓ వెబ్ సిరీస్ లో భాగంగా ఆయనతో 40 రోజులు ఉన్నానని, పది రోజులకే ఆయనలోని వ్యక్తిత్వాన్ని చూసి ఫ్లాట్ అయ్యానని చెప్పుకచ్చింది ఈ బ్యూటీ. గతేడాది ఆయనకు తన మనుసులోని మాట చెప్పాను. ఆయనలోని ప్రతీ విషయం నాకు నచ్చింది. మరి పెళ్లి గురించి హోస్ట్ అడుగగా.. నేనైతే ఆయనకు ప్రపోజ్ చేశాను. ఆయన ఏమంటారో చూడాలి అంటూ చెప్పింది. జయసుధ ఆంటీ ఒప్పుకుంటే కోడలిగా వెళ్లేందుకు నేను రెడీ అంటుంది విష్ణుప్రియ. అయితే జేడీకి 2016లో పెళ్లయింది.
అయితే ఓంకార్ అడిగాడు కాబట్టి అలా చెప్పింది విష్ణుప్రియ.. అందులో ఎలాంటి నిజం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా విష్ణుప్రియ కామెంట్ తో యాంకర్లందరూ అటెన్షన్ అయ్యారు.