Naresh-Pavitra Malli Pelli Trailer : సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎంత వరకు ఇమేజ్ పెంచుకోవాలని చూస్తారు కానీ తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేందుకు ఎంత మాత్రం ఒప్పుకోరు.. అయితే విలక్షణ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నరేష్ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాడు..
ఎవరు కూడా తమ పర్సనల్ లైఫ్ లో ఎన్ని జరుగుతున్న బైటకు మాత్రం చెప్పరు.. ఒకవేళ బయట పడిన కూడా అవి నిజాలు అని అంగీకరించేందుకు వారు ముమ్మాటికీ ఒప్పుకోరు.. కానీ నరేష్ మాత్రం తన లైఫ్ లో జరిగిన మూడవ పెళ్లి గురించి ఆ పెళ్లి విషయంలో జరిగిన కాంట్రవర్సీ గురించి ఏకంగా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అయ్యాడు..
ఎవరు కూడా తమ పర్సనల్ లైఫ్ లో ఎన్ని జరుగుతున్న బైటకు మాత్రం చెప్పరు.. ఒకవేళ బయట పడిన కూడా అవి నిజాలు అని అంగీకరించేందుకు వారు ముమ్మాటికీ ఒప్పుకోరు.. కానీ నరేష్ మాత్రం తన లైఫ్ లో జరిగిన మూడవ పెళ్లి గురించి ఆ పెళ్లి విషయంలో జరిగిన కాంట్రవర్సీ గురించి ఏకంగా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అయ్యాడు..
రమ్య రఘుపతి అనే మహిళను నరేష్ మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ జంటకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు.. ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తాయి.. విడాకులు కావాలని నరేష్ కోర్టుకు ఎక్కాడు.. ఈ కేసు నడుస్తుండగానే ఈయన నటి పవిత్ర లోకేష్ కు దగ్గర అయ్యాడు..
మరో వైపు రమ్య విడాకులు వద్దు అని పిటిషన్ వేసింది.. ఐదేళ్లుగా పవిత్ర లోకేష్, నరేష్ కలిసి జీవిస్తున్నారు.. గత ఏడాదిగా వీరి వ్యవహారం బయటకు వచ్చి రచ్చ రచ్చ అవుతుంది.. వీరి వ్యవహారం బయటకు వచ్చాక సీన్ లోకి రమ్య వచ్చి మరింత రచ్చ చేసింది.. ఈ వ్యవహారం మొత్తం ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.. ఇక ఇప్పుడు వీరి వ్యవహారం మొత్తం సినిమాగా రాబోతుంది.. డైరెక్టర్ ఎంఎస్ రాజు దర్శకత్వంలో ”మళ్ళీ పెళ్లి” అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అవ్వగా మరోసారి వివాదం చెలరేగింది..
ఈ ట్రైలర్ లో భార్య తనను హింసించినట్టు, పవిత్ర లోకేష్ కు అట్రాక్ట్ అయినట్టు చూపించారు.. రమ్య రఘుపతి నిజ స్వరూపం బయట పెట్టేందుకు నరేష్ ఈ సినిమాను చేసినట్టు తెలుస్తుంది.. ట్రైలర్ తోనే అంచనాలు పీక్స్ కు చేరిపోయేలా చేయడంలో టీమ్ అయితే సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.. ఇక ఈ సినిమా మే 26న రిలీజ్ కానుండగా ఎన్ని వివాదాలు చెలరేగుతాయో వేచి చూడాలి.