Hero Yash : కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ ప్రొడ్యూసర్ గ మారబోతున్నాడు. మాన్ట్సర్ మైండ్ క్రియేషన్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, నమిత్ మల్హోత్రాతో కలిసి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోనున్నడు. ఈ విషయాన్ని క్రిష్ శుక్రవారం (ఏప్రిల్ 12) స్వయంగా ప్రకటించాడు. ‘ఇప్పటి వరకు భారత ఇతిహాసమైన రామాయణం గురించి కచ్చితమైన కథ ఎవరూ సినిమాగా మలచలేకపోయారు. ఇప్పుడు అసలైన రామాయణాన్ని చిత్రీకరించబోతున్నాం’ అంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూవీకి నితేష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. డీఎన్ఈజీ వీఎఫ్ఎక్స్ కూడా ఇప్పటి వరకు ఎవరూ చూడని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్తున్నారు.
నితేష్ తివారీ రామాయణంలో రావణుడిగా యష్ కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వినిపస్తున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటులను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఉండబోతుందని ప్రకటించారు. అద్భుతమైన రామాయణాన్ని వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై చూపించాలని ఈ ప్రాజెక్ట్ కు రూపు తీసుకువచ్చినట్లు చెప్పారు. ‘నమిత్ నేను చాలా సార్లు రామాయణం చేస్తే బాగుంటుందని అనుకున్నాం కానీ అంతటి గొప్ప ప్రాజెక్ట్ తీయాలంటే ఊరికే కాదు. భక్తి, శ్రద్ధ తప్పకుండా ఉండాలి. ఇప్పటికే మంచి ప్రొడ్యూసర్లు ఉన్నా.. తాను కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కావాలని అనుకున్నట్లు చెప్పారు.
ఓపెన్ హైమర్, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, ఎక్స్ మచినా, బ్లేడ్ రన్నర్ 2049, ఫస్ట్ మ్యాన్, టెనెట్, డ్యూన్ వంటి చిత్రాలతో 8 ఆస్కార్ అవార్డులను అందుకున్న బ్రిటిష్ విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ యానిమేషన్, స్టీరియో కన్వర్షన్ స్టూడియో డీఎన్ ఈజీకి నమిత్ మల్హోత్రా సీఈఓగా వ్యవహరిస్తున్నారు.