తెలంగాణ మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ అస్వస్థకు గురయ్యారు. తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఎగరవేస్తున్న సమయం లో స్పృహ తప్పి పడిపో యారు. వెంటనే అక్కడ ఉన్నవారు ప్రాథమి క చికిత్స అందించి ఇంటికి తరలించారు. గణతంత్ర దినో త్సవం సంద్బంగా ఈ రోజు ఉదయం మాజీ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గోన్నారు..జెండా వందనం చేస్తున్న క్రమంలో ఓక్కసారిగా మహమ్మద్ అలీ కుప్పకూలి పోయారు. దీంతో చుట్టు ఉన్న కార్యకర్తలు ఓక్కసారిగా ఏం జరిగిం దోనని షాక్ కు గుర్యయ్యారు. వెంటనే విశాలమైన ప్రదేశానికి తీసుకెళ్లి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మహ్మద్ అలీని ఇంటిికి పంపించేశారు..