NTR 100 Rupees Coin : తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన ఆయన రాజకీయాలంటే సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో తన పాలన కొనసాగించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఆయన ప్రారంభించిందే. ఈ పథకంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అలా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాల అమలులో ముందుండి నడిపించారు.
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరవడం లేదని చెబుతున్నారు. కానీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ వంద రూపాయల కాయిన్ తీసుకురావడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబంతో పాటు ఇంకా ఓ వంద మందిని ఆహ్వానించారు.
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఏపీ నుంచి చాలా మంది వెళ్తున్నారు. ఎన్టీఆర్ కు ఆప్తులైన వారిని కూడా ఆహ్వానించారు. వీలైతే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వారు షూటింగుల్లో బిజీగా ఉంటే ఏమో కానీ సమయం ఉంటే వారు కూడా హాజరు అవుతారని అంటున్నారు.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే మొదటి నుంచి కోరుతున్నా సాధ్యం కావడం లేదు. ప్రతి సందర్బంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు వస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పుడు వంద రూపాయల నాణెం కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. నందమూరి కుటుంబం సంతోషం వ్యక్తంచేస్తోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది.