Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో మాటల యుద్ధాలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. ఎన్నికలు మరింత ముందుకు రావడంతో నాయకులు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ‘రా కదలిరా’ సభలు తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తుంటే ‘సిద్ధం’ పేరుతో వైసీపీ సభలు నిర్వహిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇవి రెండు కూడా ప్రచార సభలే.
తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన మూడు పెళ్లిళ్ల గురించి జగన్, వైసీపీ చేసిన వ్యాఖ్యలను పవన్ ప్రస్తావించారు.
‘అవును, నేను మూడు సార్లు వివాహం చేసుకున్నాను మరియు రెండు సార్లు విడాకులు తీసుకున్నాను. కానీ జగన్ మాత్రం నాకు నలుగురు భార్యలు, బహుశా జగన్ నా నాలుగో భార్య అని అంటున్నా. జగన్ కు నా పెళ్లిళ్లపై అంత ఆసక్తి ఉంటే బహుశా ఆయన నా నాలుగో భార్య అని చెప్పగలను’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రకటన వెంటనే సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
కూటమి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఈసారి ఆదర్శంగా నిలవనున్నాయని, 2024లో ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని పవన్ హామీ ఇచ్చారు. ‘జగన్ ని దించకపోతే నాపేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేననే కాదు. ఆ పార్టీ మక్కెలు ఇరగకొడుతాం’ అని పవన్ తెలుగులో అన్నారు.
ఈ సమావేశంలో పవన్ తన ప్రసంగానికి అతి దూకుడుగా వ్యవహరించడంపై జనం నుంచి చప్పట్లు, ఈలలు వచ్చాయి.